హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ ఫస్టియర్లో ప్రవేశాలకు నిర్వహించే ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ’ (దోస్త్) నోటిఫికేషన్ ఈ నెల 27 లేదా మే 1న విడుదలకానున్నది. దోస్త్ రిజిస్ట్రేషన్ మే 1 లేదా 6 నుంచి ప్రారంభంకానున్నది. బుధవారం ఇంటర్ ఫలితాలు విడుదలకానున్న నేపథ్యంలో అధికారులు షెడ్యూల్ను రూపొందించారు. మొత్తం మూడు విడతల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రంలో 1,054 డిగ్రీ కాలేజీలుండగా, వీటిల్లో 3.86 లక్షల సీట్లున్నాయి.