హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను ప్రభుత్వం రెండింతలు చేసింది. గురువారం ఒక్కరోజే లక్షకుపైగా నమూనాలను పరీక్షించారు. 1,01,986 పరీక్షలు చేయగా, 2,478 మందికి వైరస్ నిర్ధారణ అయ్యిందని శుక్రవారం బులెటిన్లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. జీహెచ్ఎంసీలో 402 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 208, నిజామాబాద్లో 176, రంగారెడ్డిలో 162, నిర్మల్లో 111, జగిత్యాలలో 105, మహబూబ్నగర్లో 96, కమారెడ్డిలో 98, నల్లగొండలో 88, కరీంనగర్లో 87, మంచిర్యాలలో 85, వరంగల్ అర్బన్లో 82, సంగారెడ్డిలో 79, ఆదిలాబాద్లో 72, కుమ్రంభీం ఆసిఫాబాద్లో 67 కేసులు నమోదయ్యాయి. కరోనాకు తోడు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా ఐదుగురు మృతిచెందారు. ప్రస్తుతం 15,472 మంది దవాఖానలు, హోంఐసొలేషన్లలో చికిత్స పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో గురువారం 31,892 నిర్ధారణ పరీక్షలు చేయగా, 2,765 మందికి పాజిటివ్గా తేలింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 496 కేసులు నమోదయ్యాయి. 11 మంది ప్రాణాలు కోల్పోయారు.