హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 2,242 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 19 మంది మరణించారు. 4,693 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,53,277కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 40,489గా ఉంది. రాష్ట్రంలో కొవిడ్తో ఇప్పటి వరకు మొత్తం 3,125 మంది చనిపోయారు.
జిల్లాల వారీగా తాజా కరోనా పాజిటివ్ కేసుల వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్-11, భద్రాద్రి కొత్తగూడెం-42, జీహెచ్ఎంసీ-343, జగిత్యాల-71, జనగాం-16, జయశంకర్ భూపాలపల్లి-20, జోగులాంబ గద్వాల-63, కామారెడ్డి-12, కరీంనగర్-165, ఖమ్మం-123, కొమురంభీం ఆసిఫాబాద్-13, మహబూబ్నగర్-134, మహబూబాబాద్-57, మంచిర్యాల-46, మెదక్-20, మేడ్చల్ మల్కాజ్గిరి-146, ములుగు-16, నాగర్కర్నూలు-57, నల్లగొండ-32, నారాయణపేట-23, నిర్మల్-7, నిజామాబాద్-30, పెద్దపల్లి-50, రాజన్న సిరిసిల్ల-28, రంగారెడ్డి-174, సంగారెడ్డి-83, సిద్దిపేట-94, సూర్యాపేట-63, వికారాబాద్-87, వనపర్తి-55, వరంగల్ రూరల్-61, వరంగల్ అర్బన్-87, యాదాద్రి భువనగిరి-13.