హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఎస్బీఐ సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2,056 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో రెగ్యులర్ పోస్టులు 2000, బ్యాక్లాగ్ 56 ఖాళీలు ఉన్నాయి. ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వారు లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరితోపాటు సీఏ, కాస్ట్ అకౌంటెంట్ ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 2021, ఏప్రిల్ 1 నాటికి 21- 30 ఏండ్ల మధ్య ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు. ఎంపిక ప్రక్రియను ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూల ఆధారంగా చేస్తారు. దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 25 చివరితేది. ప్రిలిమినరీ ఎగ్జామ్ను నవంబర్/డిసెంబర్లో నిర్వహించనున్నారు. మెయిన్ డిసెంబర్లో, ఇంటర్వ్యూలను 2022, ఫిబ్రవరి రెండో లేదా మూడో వారంలో నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం వెబ్సైట్ https://sbi.co.inలో చూడవచ్చు.