బెంగళూరు: కర్ణాటక గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ కోసం ఆ రాష్ట్ర పవర్ కార్పొరేషన్ అధికారులు లింగనమక్కి డ్యామ్ నుంచి 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గవర్నర్ గెహ్లాట్ గురువారం షిమోగ తాలూకాలోని జోగ్ జలపాతం అందాలను వీక్షించేందుకు వెళ్లారు. జలపాతాన్ని పూర్తిస్థాయిలో కనువిందు చేసేందు కోసం అధికారులు విద్యుత్ అవసరాల కోసం నిల్వ చేసిన నీటిని విడుదల చేశారు. అయితే ఆ నీటిని విడుదల చేయడాని కంటే ముందే గవర్నర్ అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం.