Andhajyothy | హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): టీచర్ పోస్టుల భర్తీపై అబద్ధాల అంధజ్యోతి మరోమారు ప్రభుత్వంపై అడ్డగోలు రాతలు రాసింది. అవాస్తవాలను గుదిగుచ్చి అచ్చేసింది. ‘మెగా డీఎస్సీ పోయి.. మినీ డీఎస్సీ వచ్చె!’ అంటూ కథనాన్ని ప్రచురించింది. వాస్తవానికి ప్రభుత్వం ఇప్పటికే గురుకులాలు, పాఠశాల విద్య కలుపుకొని 20,687 టీచర్ పోస్టులను భర్తీ చేసింది. తాజా నోటిఫికేషన్ల ద్వారా మరో 18,762 టీచర్ పోస్టుల భర్తీ చేయనున్నది. ఇప్పటికే గురుకులాల పరీక్షలు పూర్తికాగా, ఫలితాలు రావడమే ఆలస్యం. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. అంటే మొత్తం 39,449 టీచర్ పోస్టులు భర్తీకానున్నాయి. అవసరాన్ని బట్టి మరిన్ని పోస్టులు భరీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. గత ప్రభుత్వాలు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల ఊసే మర్చిపోయాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకానికి చొరవ చూపింది. దీనికితోడు పాఠశాల విద్యలో మరో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ఇటీవల ఆమోదం తెలిపింది. ఈ రెండూ కలిపి మొత్తంగా 6,612 పోస్టుల భర్తీకి ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇవేవీ పట్టించుకోని అంధజ్యోతి ఉద్యోగార్థులను రెచ్చగొట్టడమే పనిగా ఓ అబద్ధపు కథనాన్ని వండి వార్చింది.
వీటిని విస్మరించిన అంధజ్యోతి
రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాలు, మాడల్ స్కూళ్లు, కేజీబీవీలను ప్రభుత్వమే నిర్వహిస్తున్నది. విద్యార్థులు వీటిలో గణనీయంగా చేరుతుండడంతో ఇందులోని పోస్టులను ప్రాధాన్యంగా తీసుకుని భర్తీ చేస్తున్నది. పాఠశాల విద్యలో విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి మన రాష్ట్రంలోనే అధికంగా ఉంది.. యూడైస్ 2020-21 నివేదిక ప్రకారం ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి ఆర్టీఈ ప్రకారం ప్రాథమిక స్కూళ్లల్లో 1:30, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1:35, ఉన్నత పాఠశాలల్లో 1:40 చొప్పున ఉండాలి. రాష్ట్రంలో మాత్రం ప్రాథమిక పాఠశాల్లో ఈ నిష్పత్తి 1:20, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1:16, ఉన్నత పాఠశాలల్లో 1:26గా ఉంది. టీచర్లు, ఉద్యోగుల పదవీ విరమణ వయసును ప్రభుత్వం 59 ఏండ్ల నుంచి 61 ఏండ్లకు పెంచింది. ఈ కారణంగా రిటైర్మెంట్లు తగ్గాయి. కొత్త రిక్రూట్మెంట్పై దీని ప్రభావం ఉంది. కొన్ని పోస్టులను పదోన్నతుల ద్వారా మాత్రమే భర్తీ చేయాల్సి ఉంటుంది. గెజిటెడ్ హెచ్ఎం, పీఎస్ హెచ్ఎం పోస్టులను పదోన్నతుల ద్వారా మాత్రమే భర్తీ చేయాల్సి ఉంటుంది. వీటిని ఖాళీల్లో చూపించడం కుదరదు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో 70శాతం పోస్టులను పదోన్నతుల ద్వారానే భర్తీచేయాలి. 30 శాతం పోస్టులను మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీచేస్తారు. మొత్తం ఖాళీలుగా కనిపించినా ఈ నిబంధనలు పాటించకుండా ఒకే దఫాలో భర్తీచేయడం కుదరదు.
కాంట్రాక్ట్ లెక్చరర్లతోనే కానిచ్చారు
ఉమ్మడి పాలనలో ప్రభుత్వం ఉన్నత విద్యలో పోస్టులను నింపిన పాపాన పోలేదు. ఇంటర్ విద్యలో 2001 తర్వాత కాంట్రాక్ట్ లెక్చరర్లు, గెస్ట్ లెక్చరర్లతోనే కొనసాగించారు. డిగ్రీ కాలేజీల్లో పదేండ్లుగా నియామకాలు లేవు. ఆయా కాలేజీల్లోను మినిమం టైం స్కేల్ మొదలుకుని.. కాంట్రాక్ట్, గెస్ట్ ఫ్యాకల్టీతోనే మమ అనిపించారు. కానీ తెలంగాణ సర్కారు పోస్టులను భర్తీచేసే ప్రయత్నం చేసినా తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు దక్కాలన్న తలంపుతో నూతన జోనల్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానానికి రాష్ట్రపతి ఆమోదం లభించడంలో జరిగిన జాప్యం వల్లే భర్తీ కొంత ఆలస్యమైంది. నూతన జోనల్ విధానం అమల్లోకి రాగానే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని చేపట్టింది.
ఆయా వివరాలు ఇలా
గతంలో పోస్టుల భర్తీ ఇలా
స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు
పదోన్నతులు కల్పించేవి