హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): వచ్చే బడ్జెట్లో బీసీలకు రూ.20 వేల కోట్లు కేటాయించాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి బట్టి విక్రమారను జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య కోరారు. శుక్రవారం సచివాలయంలో భట్టి విక్రమార్కను కలిసిన కృష్ణయ్య ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. బీసీలకు సబ్సిడీ రుణాల కోసం బీసీ కార్పొరేషన్కు రూ.4 వేల కోట్లు కేటాయించి, బీసీబంధు పథకం ప్రవేశ పెట్టాలని, ఎంబీసీ కార్పొరేషన్కు రూ.2 వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తిచేశారు. 12 బీసీ కులాల ఫెడరేషన్లకు జనాభా నిష్పత్తిలో రూ.2 వేల కోట్లు కేటాయించాలని, ఉన్నత విద్యను అభ్యసించే బీసీ విద్యార్థుల మొత్తం ఫీజుల సీమును పునరుద్ధరించాలని కోరారు. పెరిగిన ధరల ప్రకారం మెస్ చార్జీలు, సాలర్ షిప్లు పెంచాలని కోరారు. డిప్యూటీ సీఎంను కలిసినవారిలో గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, కోట్ల శ్రీనివాస్, పీ సుధాకర్, రేగుల మధుసూదన్, టీ రాజ్కుమార్, రాజేందర్, ఎం పృథ్వీగౌడ్, పల్లగొర్ల మోడిరాందేవ్, అశోక్ ఉన్నారు.