Road Accident | కరీంనగర్ జిల్లాలో ఆదివారం భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తపల్లి మండలం చింత కుంట వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నది. టాటా ఎస్ వాహనాన్ని మరో కారు ఢీకొనడంతో 20 మంది గాయ పడ్డారు. బాధితులు ములుగు, మహబూబాబాద్ జిల్లాల వారని గుర్తించారు. వేములవాడలో దైవ దర్శనానికి వెళ్లి, తిరిగి వస్తుండగా, ఈ దుర్ఘటన జరిగింది.
టాటా ఏస్ వాహనంలో 15 మంది, కారులో ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. ఈ సమాచారం అందగానే పోలీసులు అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితులను చికిత్స కోసం దవాఖానలకు తరలించారు. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయమై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.