హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఫుడ్స్లో పనిచేస్తున్న రెగ్యులర్, క్యాజువల్ ఉద్యోగుల అన్ని అలవెన్స్లను 20 శాతం పెంపునకు ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఆమోదించినట్టు సంస్థ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ తెలిపారు. అలవెన్సులను పెంచుతూ నిర్ణయించిన సీఎం కేసీఆర్, మంత్రి సత్యవతి రాథోడ్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్లోని టీఎస్ ఫుడ్స్ కార్యాలయంలో సోమవారం జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం అనంతరం ఆయన వివరాలు వెల్లడించారు. ఎంఎండబ్ల్యూలో పనిచేస్తున్న ఉద్యోగులు, రెగ్యులర్ ఎంప్లాయీస్గా పనిచేసినవారు చనిపోతే వారి పిల్లలకు ఉద్యోగ భద్రత ఇచ్చేందుకు సైతం ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపారు. టీఎస్ ఫుడ్స్లో పనిచేసిన శాశ్వత ఉద్యోగి వెంకటేశ్వరరావు మరణించడంతో, అతని భార్య రామానుజదేవికి, మరో ఉద్యోగి రామదాసు కొడుకుకు మెడికల్ ఇన్వాల్యిడేషన్ కింద ఉద్యోగాలు ఇవ్వాలని ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించిందని చెప్పారు.