హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో (Gachibowli) విషాదం చోటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ఇద్దరు కులీలు మృతిచెందారు. కొండపూర్లోని గౌతమి ఎన్క్లేవ్లో ఉన్న అపార్ట్మెంట్లో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయడానికి ఇద్దరు కూలీలు అందులోకి దిగారు. ఈ క్రమంలో ఊపిరాడక మరణించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను అందులోని బయటకు తీశారు. మృతులు నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని ఘాజీనగర్కు చెందినవారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారు సైదాబాద్లోని సింగరేణి కాలనీలో నివాసం ఉంటున్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తమకు న్యాయం చేయాలని మృతుల కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు.