Accident | సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. తుంగతుర్తి మండలం బండరామరం వద్ద ఓ బైక్ అదుపుతప్పింది. రోడ్డు పక్కనున్న సిమెంట్ దిమ్మెను బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను తిరుమలగిరి మండలం మాలిపురానికి చెందిన వేముల నాగరాజు(26), వేముల కార్తీక్(24)గా పోలీసులు గుర్తించారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వేముల నాగరాజు హైదరాబాద్లో కానిస్టేబుల్గా పని చేస్తున్నట్లు తెలిసింది.