హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-70లో పెద్ద ఎత్తున డబ్బును పట్టుకున్నారు. కారులో తరలిస్తుండగా రూ.2.5కోట్ల నగదును వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. పట్టుకున్న డబ్బు హవాలా డబ్బుగా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారిని అశోక్ సేన్, సుధీర్కుమార్, రాముగా గుర్తించారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బును ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలో పోలీసులు రూ.4కోట్ల వరకు నగదును సీజ్ చేశారు.