హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 2.26 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు ఐదు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి 2.20 లక్షల క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ఇప్పుడు 884.40 అడుగుల వద్ద నీరు ఉన్నది. ప్రాజెక్టులో 215.80 టీఎంసీలకు గాను 212.43 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నది. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది. కాగా, నాగార్జున సాగర్కు స్పిల్వే ద్వారా 1.39 లక్షల క్యూసెక్కులు, జలవిద్యుత్ ద్వారా 62,723 క్యూసెక్కుల వరద వెళ్తున్నది.