నిజామాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కామారెడ్డికి భగీరథ నీళ్లు సాఫీ గా సరఫరా చేసేందుకు జీఆర్పీ పైప్లైన్లు మార్చి కొత్తవి వేయాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలం గా స్పందించిన సీఎం కేసీఆర్ రూ.195 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు ఇచ్చారు. ఈ మేరకు సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్ మంగళవారం జీవో జారీ చేశారు.