హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 19 మంది ఆర్డీవోలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ బదిలీలు చేపట్టినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.