హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన నారీమణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8వ తేదీ) సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలు ప్రకటించింది. సాహిత్యం, కళలు, సమాజసేవ ఇలా పలు రంగాల్లో ప్రతిభ కనబర్చిన 17 మందితోపాటు రెండు సంస్థలను మహిళా పురస్కారాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
తానిపర్తి చికిత (ఆటలు), కుడుముల లోకేశ్వరి (ఆటలు), ముక్తేవి భారతి (సాహిత్యం), దీవనపల్లి వీణావాణీ, సురయా జబీన్ (ఉర్దూ సాహిత్యం), బండ సరోజన (విద్య), బీనా కేశవరావు (హస్తకళలు), గుర్రాల సరోజ (సమాజసేవ), జమీల నిషాత్ (సమాజసేవ), అరిపిన జయలక్ష్మి (ప్రత్యేక విభాగం), దయ్యాల భాగ్య (నృత్యం-ప్రత్యేక ప్రతిభావంతురాలు), ప్రొఫెసర్ అరుణ భిక్షు (నృత్యం, కూచిపుడి), సునీల ప్రకాశ్ (పేరిణి నృత్యం), బండి రాములమ్మ (బోనాల కోలాటం), గొరిగె నీల (బోనాల కోలాటం), మత్తడి సరవ్వ (డప్పు కళాకారిణి), సీహెచ్ పుష్ప (సేంద్రీయ వ్యవసాయం), లుఖ్మా కమ్యూనిటీ కిచెన్, సఫా ఎన్జీవో (ఔత్సాహిక పారిశ్రామిక విభాగం), శక్తి టీం (దక్షిణ మధ్య రైల్వే ఉమెన్ ఆర్పీఎఫ్) అవార్డులకు ఎంపిక చేసింది.