హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ పరీక్షల్లో మంగళవారం ఒకే రోజు 19 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. మహబూబ్నగర్ జిల్లాలో 12 మంది విద్యార్థులు మాల్ప్రాక్టీస్కు పాల్పడుతూ దొరికారు. ఇక నిజామాబాద్, ఖమ్మం, నాగర్కర్నూల్, నల్లగొండల్లో ఒకరు చొప్పున విద్యార్థులు మాల్ప్రాక్టీస్కు పాల్పడుతుండగా అధికారులు గుర్తించి పట్టుకున్నారు.
మంగళవారం సెకండియర్ విద్యార్థులకు మ్యాథ్స్ పేపర్-2ఏ, వృక్షశాస్త్రం (బోటనీ), పొలిటికల్ సైన్స్ పేపర్-2లకు పరీక్షలను నిర్వహించారు. మొత్తం 4,68,531 మంది విద్యార్థులకు గాను 4,54,323 మంది పరీక్షకు హాజరయ్యారు. 14,208 (3.03 శాతం) విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. పరిశీలకులు నిర్మల్, మహబూబాబాద్, ఖమ్మం, నల్లగొండ, నాగర్కర్నూల్, హైదరాబాద్ జిల్లాల్లోని పరీక్షాకేంద్రాలను తనిఖీచేసినట్టు ఇంటర్బోర్డు అధికారులు తెలిపారు.