Secunderabad | హైదరాబాద్ : ఘట్కేసర్ – చర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య కొనసాగుతున్న రైల్వే కోచ్ టెర్మినల్ పనుల వల్ల పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యలో సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే ఆధ్వర్యంలో దాదాపు 17 రైళ్లను రద్దు చేసినట్లు గురువారం రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఈ రైళ్లు ఈ నెల 21వ తేదీ (ఆదివారం) వరకు అందుబాటులో ఉండవు.
వరంగల్ -సికింద్రాబాద్, హైదరాబాద్-కాజీపేట్, కాచిగూడ-మిర్యాలగూడ, నడికుడి – మిర్యాలగూడ, గుంటూరు-వికారాబాద్, హైదరాబాద్-సిర్పూర్ కాగజ్నగర్, సికింద్రాబాద్ – గుంటూరు, సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్నగర్ వంటి పలు స్టేషన్ల మధ్య రైళ్లు రద్దు ఉంటాయన్నారు. అలాగే ఐదు రైళ్ల సమయాలను రీషెడ్యూల్ చేశామన్నారు.