సుల్తాన్బజార్, జూలై 8: తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉస్మానియా దవాఖానకు వచ్చిన ఓ మహిళ కడుపులో 16 కిలోల కణితిని వైద్యులు తొలగించారు. ఉస్మానియా దవాఖాన వైద్యులు బుధవారం ఈ వివరాలు వెల్లడించారు.
నగరంలోని బోరబండకు చెందిన కే రాజేశ్వరి(38) కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నది. స్థానికంగా ఉన్న ఓ దవాఖానలో చూపించినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో ఉస్మానియా దవాఖానకు వచ్చింది. పరీక్షలు నిర్వహించగా కణితిని గుర్తించారు. జనరల్ సర్జరీ యూనిట్ చీఫ్ డాక్టర్ విజయ్కుమార్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఆ కణితిని తొలగించారు.