హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పాత్రికేయుల సంక్షేమానికి మీడియా అకాడమీ రూ.16 కోట్లు ఖర్చు చేసిందని చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. జర్నలిస్టులు, వారి కుటుంబాల సేవ కోసం తనకు మూడోసారి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశం రావడానికి సహకరించిన మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎంపీ సంతోష్కుమార్, ఎమ్మెల్యే క్రాంతికిరణ్కు ధన్యవాదాలు తెలియజేశారు.
బుధవారం మీడియా అకాడమీ కార్యాలయంలో జర్నలిస్టులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అల్లం నారాయణ మాట్లాడుతూ.. 8 ఏండ్ల తన పదవీ కాలంలో అన్ని జిల్లాల్లో ఏడు వేల మంది జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. మహిళలు, డెస్క్ జర్నలిస్టులు సహా మొత్తం 20 వేల మందికి అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు హెల్త్ కా ర్డులు ఇచ్చామని, నగదు రహిత చికిత్స కోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ.25 కోట్లు సాయం చేసిందని చెప్పారు.
ఈ డబ్బును డిపాజిట్ చేసి దానిపై వచ్చిన వడ్డీతో 451 కుటుంబాలకు నెలకు రూ.3 వేల పెన్షన్తోపాటు 207 మంది విద్యార్థులు చదువుకోవడానికి నెలకు వెయ్యి చొప్పున ట్యూషన్ ఫీజును అకాడమీ అందజేస్తున్నదని తెలిపారు. వృత్తిలో ఉపయో గ పడే 12 పుస్తకాలను ప్రచురించి శిక్షణ తరగతులలో ఉచితంగా మీడియా అకాడమీ పం పిణీ చేస్తున్నదన్నారు.
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, తాను కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ రాజమౌళి, అడిషనల్ డైరెక్టర్ నాగయ్య, జాయింట్ డైరెక్టర్ జగన్, మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వరరావు, జర్నలిస్టు సం ఘం నాయకులు మారుతిసాగర్, యోగానం ద్, ఇస్మాయిల్, కట్టా కవిత పాల్గొన్నారు.