హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ మొదటి సంవత్సరంలో మరో 15,490 మంది విద్యార్థులు కొత్తగా ప్రవేశాలు పొందారు. వీరికి స్పెషల్ డ్రైవ్ ఫేజ్ అడ్మిషన్లలో భాగంగా డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) అధికారులు శనివారం సీట్లను కేటాయించారు. వెబ్ కౌన్సెలింగ్కు 16,409 మంది హాజరయ్యారు. ఇటీవలే కొత్తగా ప్రవేశపెట్టిన కోర్సుల్లోనూ విద్యార్థులు గణనీయంగా ప్రవేశాలు పొందారు.
డాటా సైన్స్ (ఏఐఎంఎల్) కోర్సులో 174, బీఎస్సీ (ఆనర్స్) కంప్యూటర్ సైన్స్లో 92, బీఎస్సీ (ఆనర్స్) బయోటెక్నాలజీలో 20, అప్రెంటిస్షిప్ ఎంబీడెడ్ కోర్సుల్లో 253, ఇతర కోర్సుల్లో మరో 1,380 మంది ప్రవేశాలు పొందారు. విద్యార్థులంతా ఈ నెల 15లోపు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇదే గడువులోగా కాలేజీల్లోనూ ప్రత్యక్షంగా రిపోర్ట్ చేయాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు.
కోర్సుల వారీగా సీట్లు పొందిన విద్యార్థులు