Telangana Assembly | హైదరాబాద్ : తెలంగాణ మూడో అసెంబ్లీ కొలువుదీరింది. తొలి రోజు 119 మంది ఎమ్మెల్యేలకు గానూ 99 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 60 మంది, బీఆర్ఎస్ నుంచి 32 మంది, ఎంఐఎం నుంచి ఆరుగురు, సీపీఐ నుంచి ఒకరు ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. వీరిలో 15 మంది ఆంగ్లంలో ప్రమాణస్వీకారం చేశారు.
ఆంగ్ల భాషలో ప్రమాణం చేసిన వారిలో లాస్య నందిత, పద్మావతి రెడ్డి, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, బండారి లక్ష్మారెడ్డి, గడ్డం వినోద్, మధుసూదన్ రెడ్డి, కేపీ వివేకానంద, కాలేరు వెంకటేశ్, ప్రేమ్ సాగర్ రావు, లక్ష్మీకాంతారావు, మదన్ మోహన్ రావు, ముఠా గోపాల్, మైనంపల్లి రోహిత్, తెల్లం వెంకట్రావ్, గడ్డం వివేక్ ఉన్నారు. ఎంఐఎం నుంచి గెలుపొందిన అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, జాఫర్ హుస్సేన్, కౌసర్ మొయినుద్దీన్, జుల్ఫీకర్ అలీ, మహ్మద్ మాజీద్ హుస్సేన్, మహ్మద్ మోబిన్ ఉర్దూలో ప్రమాణం చేశారు.