వనపర్తి: వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. యాదిగిరిగుట్ట డిపోనకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నది. ఈక్రమంలో కొత్తకోట వద్ద జాతీయ రహదారి-44 పక్కన అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో 15 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వనపర్తి జిల్లా దవాఖానకు తరలించారు.
గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విసమంగా ఉందని చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ఉన్నారని తెలిపారు. బాధితులను నర్సింహ (కేశంపేట), జయన్న (బద్వేల్), షబ్బీర్ అహ్మద్ (కర్నూల్), కృపానంద (హైదరాబాద్), శ్రీకాంత్చారి (హన్మకొండ), షకీల (రాయచోటి), అర్జున్ (కర్నూల్), ఉపేందర్ (జనగామ), శ్రీరామ్ (రాయచోటి), రఫీక్ (షాద్నగర్), సుమలత (ఆళ్లగడ్డ)గా గుర్తించారు.