హైదరాబాద్ : నాగర్ కర్నూల్ జిల్లాలోని సింగోటం శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధి పనులకు రూ. 15 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎస్డీఎఫ్ నిధుల నుంచి రూ. 15 కోట్లు మంజూరు చేసినట్లు ప్రణాళిక శాఖ తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
ఆలయ అభివృద్ధికి రూ. 576 లక్షలు, భక్తుల సర్వీసుల కోసం రూ. 84 లక్షలు, వసతి సదుపాయాల కోసం రూ. 330 లక్షలు, నీటి సరఫరాకు రూ. 85 లక్షలు, సీవరేజ్, శానిటేషన్ కోసం రూ. 76 లక్షలు, భూసేకరణ కోసం రూ. 349 లక్షలను విడుదల చేశారు.