హైదరాబాద్, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ): వచ్చే 13న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు 139 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. రంగారెడ్డి-మహబూబ్నగర్-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు 137 పోలింగ్ కేంద్రాలను, పర్యవేక్షణ కోసం 35 ఫ్లయింగ్, వీడియో బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 12 ఫ్లయింగ్, వీడియో బృందాలను ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. రెండు స్థానాలకు ఓటర్ల తుది జాబితాను ఈ నెల 23న వెల్లడించనున్నట్టు పేర్కొన్నది. ఇప్పటివరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 9 నామినేషన్లు దాఖలు కాగా, స్థానిక సంస్థల ఎన్నికకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.