హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏటికేడు తిరుగులేని ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. పటిష్ట ప్రణాళికలతో ఆదాయ మార్గాలను పెంచుకుంటూ అనతికాలంలోనే దేశంలోని అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. వయసులో చిన్న రాష్ట్రమైనప్పటికీ వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో గణనీయ వృద్ధిరేటును నమో దు చేస్తున్నది. కేంద్రం జీఎస్టీని ప్రవేశపెటిన 2019-20 ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్-జూన్ త్రైమాసికం (క్యూ-1లో) రూ.6,326 కోట్ల వసూ ళ్లు సాధించిన రాష్ర్టానికి ఈ ఏడాది అదే త్రైమాసికంలో రూ.14,810 కోట్ల రాబడి వచ్చింది. ఇది రాష్ట్ర బడ్జెట్ అంచనా (రూ.50,942 కోట్లు)లో 29 శాతానికి సమానం. ఐదేండ్ల క్రితం నాటి వ సూళ్ల కంటే 134% శాతం (రూ.8,484 కోట్లు), నిరురుడు ఇదే కాలంలో వచ్చిన రూ.9,645 కోట్ల వసూళ్ల కంటే రూ.5,165 కోట్లు అధికం.
సంస్కరణలతో అనూహ్య ఫలితాలు
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వనరుల అభివృద్ధిపై దృష్టి సారించింది. అందులో భాగంగా వాణిజ్య పన్నుల శాఖపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, రాష్ట్రవ్యాప్తంగా అనేక కొత్త సర్కిళ్లను ఏర్పాటు చేసింది. ప్రతిస్థాయిలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించడంతోపాటు మాన్యువల్ నోటీసులు, ప్రొసీడింగ్ల జారీని పూర్తిగా తొలగించింది. శాఖాపరమైన పరిశోధనలు, విశ్లేషణల కోసం ఎకనమిక్ ఇంటెలిజెన్స్ యూనిట్లను ఏర్పా టు చేసింది. తద్వారా అనూహ్య ఫలితాలతో రాబడులను గణనీయంగా పెంచుకుంటూ దేశంలోని అనేక రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నది.