హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్కు చెందిన పోలు లక్ష్మీసాయి లోహిత్రెడ్డి జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. వంగపల్లి సాయి సిద్ధార్థ 4వర్యాంకు, ధీరజ్కురుకుంద 8వ ర్యాంకు, నందన్ మంజూనాథ్ 12వ ర్యాంకును కైవసం చేసుకొన్నారు. రిజర్వేషన్ల వారీగా తీసుకొంటే ఓబీసీ ఎన్సీఎల్ కోటాలో వంగపల్లి సాయి సిద్ధార్థ , జనరల్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ కోటాలో గైకోటి విజ్ఞేశ్ జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. దేశవ్యాప్తంగా ఐఐటీ బాంబే జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ను ఈ ఏడాది ఆగస్టు 28న నిర్వహించింది. ఈ ఫలితాల్లో ఐఐటీ మద్రాస్ జోన్ విద్యార్థులు సత్తాచాటారు. టాప్ 100లో 29, టాప్ 200లో 60, టాప్ 300లో 88, టాప్ 400లో 109, టాప్ 500 లోపు 132 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారు.
క్యాటగిరీ వారీగా ర్యాంకులు
F ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరిలో వీ సాయి సిద్ధార్థ 1, బీ గిరీష్ 2, కే సాయి ఆదిత్య 7ర్యాంకు సొంతం చేసుకున్నారు. జనరల్ పీడబ్ల్యూడీలో పీ స్నేహిత్రెడ్డి, 2, ఏ అమరేశ్వర్ 4, బీ శివాని 12, జనరల్ ఈడబ్ల్యూఎస్లో ఏ అక్షత్రెడ్డి 4, టీ శ్రేయాస్రెడ్డి 14, సాయి శ్రీరామ్ 15, ఎస్సీ కోటాలో యూ ఆశిశ్ రాణా 5, ఎస్టీ కోటాలో బీ గిరిశ్ 2, పీ మణిరాజ్ 5, బీ మిథిల 11, ఎం సాయి నిఖిల్ 17, వరుణ్ 19 ర్యాంకును సాధించారు.
నేటి నుంచి జోసా రిజిస్ట్రేషన్
అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలైనందున జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) రిజిస్ట్రేషన్ ఈ నెల 12 నుంచి ప్రారంభంకానున్నది. మొత్తం 6 విడతల్లో సీట్లను కేటాయించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో 16,598 సీట్లున్నాయి. వీటిలో అమ్మాయిల కోసం 1,567 సీట్లను సూపర్న్యూమరరీ కోటాలో కేటాయిస్తారు.
ఐఐటీ బాంబేలో చేరుతా
మా స్వస్థలం ఒంగో లు. పాఠశాల విద్య అం తా అక్కడే పూర్తయ్యింది. ఇంటర్ హైదరాబాద్లో చదివా. 8వ తరగతి నుంచే జేఈఈ టార్గెట్గా పెట్టుకొని చదివా. ప్రతి సబ్జెక్టును క్షుణ్ణంగా చదవడం, తప్పులను ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవడం కలిసొచ్చింది. వీక్గా ఉన్న టాపిక్స్పై ప్రత్యేక దృష్టిపెట్టా. చివరి క్షణం వరకు పూర్తికాన్ఫిడెన్స్తో అడ్వాన్స్డ్కు సన్నద్ధమయ్యా. మంచి ర్యాంక్ వచ్చింది కనుక ఐఐటీ బాంబేలో చేరుతా.
– పోలు లక్ష్మీసాయి లోహిత్రెడ్డి, ఆలిండియా 2వ ర్యాంక్
సాఫ్ట్వేర్లో స్థిరపడుతా
మెయిన్లో ఆలిండియా 4వ ర్యాంకు రావడంతో అడ్వాన్స్డ్లో టాప్ 10లో ఉంటానని గట్టి నమ్మకంతో ప్రణాళిక బద్ధంగా చదివాను. మా కుటుంబం హైదరాబాద్లోని మాదాపూర్లో ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో రిసెర్చ్ చేసి కంపెనీ పెట్టాలన్నది నా ఆశయం. ఐఐటీ బాంబే లేదా ఐఐటీ ఢిల్లీలో కంప్యూటర్ సైన్స్లో చేరుతా.
– ధీరజ్ , ఆలిండియా 8వ ర్యాంకు
కంప్యూటర్సైన్స్లో రిసెర్చ్ చేస్తా
విజయవాడలో పదోతరగతి, హైదరాబాద్లో ఇంటర్ చదివా. నాన్న వెంకట సుబ్బారావు విద్యుత్తుశాఖలో ఉద్యోగి, తల్లి గృహిణి. ఎల్కేజీ నుంచి ప్రతి క్లాస్లో ఫస్ట్ర్యాంక్లో ఉండేవాడ్ని. తల్లిదండ్రుల తోడ్పాటు, లెక్చరర్లు అందించిన సహకారం ఇందుకు తోడ్పడింది. మ్యాథ్స్ ఒలింపియాడ్కు ఎంపికయ్యా. ఐఐటీ బాంబేలో సీటు వస్తుంది. కంప్యూటర్ సైన్స్లో రిసెర్చ్ చేస్తా.
– వీ సాయి సిద్ధార్థ, ఆలిండియా4వ ర్యాంక్
ఇన్నోవేటర్నవుతా
అడ్వాన్స్డ్లో మంచి ర్యాంక్ రావడం సంతోషానిచ్చింది. మా కుటుం బం హైదరాబాద్లోని కొండాపూర్లో నివాసముంటున్నది. పాఠశాల విద్య హైదరాబాద్లో పూర్తయ్యింది. నాన్న మల్లికార్జున్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, అమ్మ రమ గృహిణి. ఐఐటీలో చేరాలన్న కసితో అడ్వాన్స్డ్ చదివా. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్లో చేరుతా.
– నందన్ మంజునాథ్, ఆలిండియా 12వ ర్యాంకు