హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) ముగిసే నాటికి 126 కిలోమీటర్ల జాతీయ రహదారులను పూర్తి చేయాలని జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది.
ఇటీవల జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. రూ.2619.11 కోట్ల అంచనా వ్యయంతో ఎల్లారెడ్డి నుం చి రూద్రూర్ (765 డీ), ఖమ్మం డివిజన్ (365ఏ), ఆదిలాబాద్ – బెలా రోడ్డు (353బీ), కల్వకుర్తి డివిజన్ (167కే) మార్గాలతోపాటు కృష్ణానదిపై భారీ వంతెన నిర్మాణాలు చేపట్టనున్నారు.