రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల పట్టణంలో ఘోరం జరిగింది. ఒకటో వార్డులోని పోచవేణి శ్రీనివాస్ యాదవ్.. గత కొంతకాలం నుంచి గొర్రె పిల్లలను పెంచుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే శుక్రవారం సాయంత్రం గొర్రె పిల్లలపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 12 గొర్రె పిల్లలు మృతి చెందాయి. దీంతో శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. భారీగా ఆస్తి నష్టం సంభవించిందని బోరున విలపించారు.