ఉప్పునుంతల: నాగర్కర్నూల్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఉప్పునుంతల మండలంలోని వెల్టూర్ స్టేజి సమీపంలో హైదరాబాద్, శ్రీశైలం జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు గుద్దుకున్నాయి. దీంతో కార్లలో ఉన్న 12 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను అచ్చంపేట దవాఖానకు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.