Karimnagar | మకరంపుర : విద్యుత్ చౌర్యం( Power Theft ) కేసులో నిందితుడికి భారీ జరిమానా విధిస్తూ న్యాయమూర్తి( Judge ) తీర్పునిచ్చారు. కరీంనగర్ విజిలెన్స్( Karimnagar Vigilance ) ఏపీటీఎస్ పోలీస్స్టేషన్ సీఐ కే స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. చొప్పదండి మండలం గుమ్లాపూర్కు చెందిన గుండేటి రాజరమేశ్ 2017లో విద్యుత్ చౌర్యం చేస్తూ పట్టుబడగా రూ. వెయ్యి జరిమానా విధించారు.
తిరిగి రెండోసారి పట్టుబడగా విజిలెన్స్ పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో కరీంనగర్ జిల్లా ఫస్ట్క్లాస్ జడ్జి శ్రీవాణి నిందితుడికి శుక్రవారం రూ.11,34,834ల జరిమానా లేదా మూడు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.