హైదరాబాద్, ఏప్రిల్8 (నమస్తే తెలంగాణ) : రవీంద్రభారతిలో 11న మహాత్మా జ్యోతిబాపూలే 197వ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. శనివారం అసెంబ్లీ ఆవరణలో జయంతి పోస్టర్ను మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, రమణతో కలిసి ఆవిష్కరించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ వేడుకలకు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
వేడుకల నిర్వహణకు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ చైర్మన్గా ప్రభుత్వం ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కమిటీ నియామకంపై ఎంబీసీ సంఘం జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ, కో కన్వీనర్ రాచమల్ల బాలకృష్ణ, తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోత్రాల శ్రీనివాస్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.