హైదరాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. గురువారం ఉదయం 11.30 గంటలకు జూబ్లీహిల్స్లోని ఎంసీఆర్హెచ్చార్డీలో విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను www.bse.telangana.gov. in, www.bseresults.telangana.gov.in, www.ntnews.comలో చూడవచ్చు. పది పరీక్షలను ఈ ఏడాది మే 23 నుంచి జూన్ 1 వరకు నిర్వహించారు. మొత్తం 5,08,143 రెగ్యులర్ విద్యార్థులకు 5,03,114 మంది ఎస్సెస్సీ పరీక్షలు రాశారు. 167 మంది ప్రైవేట్ విద్యార్థులకు 87 మంది పరీక్షలకు హాజరయ్యారు.