హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖలో భారీస్థాయిలో అధికారుల బదిలీలను చేపట్టారు. రెండ్రోజుల్లో 563 మందికి స్థానంచలనం కల్పించారు. దాదాపుగా జిల్లా స్థాయి అధికారులందరినీ బదిలీ చేశారు.
ఆదివారం 395 మంది ఎంపీడీవోలను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. సోమవారం 105 జిల్లా పరిషత్ సీఈవోలు, డిప్యూటీ సీఈవోలు, డీఆర్డీవోలు, డీపీవోలు, 39 మంది డీఎల్పీవోలను, 24 మంది అడిషనల్ డీఆర్డీవోలను బదిలీ చేసింది.