హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి చెందిన 10 మంది అధికారులను కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్లుగా గుర్తించింది. కే అశోక్రెడ్డి, కే హరిత, పీ కాత్యాయనీదేవి, ఈవీ నర్సింహారెడ్డి, ఈ నవీన్ నికోలస్, ఏ నిర్మలాకాంతి వెస్లీ, కోట శ్రీవాత్సవ, చంద్రశేఖర్, ప్రియాంక, అరుణశ్రీకి ఐఏఎఎస్ హోదా ఇస్తూ కేంద్ర ప్రభుత్వ అంతర్గత వ్యవహారాలు, శిక్షణ శాఖ (డీవోపీటీ) గెజిట్ జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం నాన్ సివిల్ సర్వీసెస్ కోటా కింద 25 మంది అధికారులకు కన్ఫర్డ్ ఐఏఎస్లుగా పదోన్నతి కల్పిస్తూ 2021లో నిర్ణయం తీసుకున్నది. వారికి గతనెల 24, 27 తేదీల్లో ఢిల్లీ యూపీఎస్సీ భవన్లో ఇంటర్వ్యూలు జరిగాయి. సెలక్షన్ కమిటీ 10 మందిని ఎం పిక చేసి, వారి పేర్లను డీవోపీటీకి పం పగా.. బుధవారం గెజిట్ జారీ చేసింది.