హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): హజ్ యాత్రికుల సేవకు ప్రత్యేకంగా 10 మంది అధికారులను నియమించినట్టు రాష్ట్ర హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ అధికారి షఫియుల్లా తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల్లోని 157 మంది అధికారులు యాత్రికుల స్వచ్ఛంద సేవకు దరఖాస్తు చేసుకోగా, 129 మందిని అర్హులుగా గుర్తించామని పేర్కొన్నారు. ఈసారి రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు1724 మందికే అవకాశం లభించగా, 150 మంది యాత్రికులకు ఒకరు చొప్పున సహాయం చేసేందుకు డ్రా పద్ధతి ద్వారా 10 మందిని ఎంపిక చేశామని వెల్లడించారు. మరో ఇద్దరిని రిజర్వ్గా పెట్టామని చెప్పారు. ఎంపికైన అధికారులకు వచ్చే నెల 7, 8 తేదీల్లో ముంబయిలో శిక్షణ ఉంటుందని బుధవారం షఫియుల్లా ఒక ప్రకటనలో తెలిపారు.