సిద్దిపేట : ములుగు తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. తుఫాన్ వాహనం, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.