CM KCR | ఉన్నతమైన ఆలోచనలు ఉన్న వ్యక్తుల నుంచి మాత్రమే ప్రపంచాన్ని మార్చే గొప్ప సంస్కరణలను ఆశించగలమని గ్రీకులు నమ్మేవారు. దీన్ని ఆచరణాత్మకంగా చేసి చూపించింది కేసీఆర్ సర్కారు. 77 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో సంస్కరణల పేరు వింటేనే పేద, మధ్యతరగతి బిడ్డలు భయపడే దుస్థితి దాపురించింది. పేదల నెత్తిన భారం మోపడం, కాకులను కొట్టి గద్దలకు వేయడం, ప్రకృతి వనరులను కార్పొరేట్లకు దోచిపెట్టడం.. అనేవే గొప్ప సంస్కరణలుగా ఇప్పటి వరకు ప్రతి జాతీయ, ప్రాంతీయ పార్టీ వ్యవహరించింది. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలోనూ ఇదే జరిగింది. అయితే, ఏకపక్ష విధానాలకు, దోపిడీ పద్ధతులకు ప్రత్యేక తెలంగాణలో కేసీఆర్ సర్కారు చరమగీతం పాడింది. పేదలు, బడుగు బలహీన వర్గాల కోణంలో ఏకంగా పది విప్లవాత్మక నిర్ణయాలతో సంస్కరణలకు కొత్త అర్థాన్ని ఇచ్చింది. అలా.. దేశానికి కొత్తదారి చూపించి, సంస్కరణలకు అడ్డాగా తెలంగాణ గడ్డ మారింది.
తెలంగాణ ప్రభుత్వం గడచిన పదేండ్ల పాలనలో దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సబ్బండ వర్గాలకు అండగా నిలబడింది. అనేక పరిపాలనా సంస్కరణలకు సైతం నాంది పలికింది. కొత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీలను ఏర్పాటు చేసి పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. విధానపరమైన నిర్ణయాలను తీసుకుని ప్రజల చెంతకే పాలనను చేర్చడంతో పాటు, పారదర్శక సేవలను అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ముఖ్యంగా కేసీఆర్ సర్కారు హయాంలో పదేండ్లలో వచ్చిన 10 విప్లవాత్మక సంస్కరణలు ఏమిటో ఓ సారి చూద్దాం…
పరిపాలన
ప్రజల చెంతకే పరిపాలనను చేర్చడంలో భాగంగా కొత్తగా జిల్లాలు, ఎప్పటికప్పుడు ప్రజల డిమాండ్, అవసరాల మేరకు కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు, తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. ఒక జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలు ఒకే చోట ఉండేలా జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్లు, పోలీసు కార్యాలయాలను నిర్మిస్తు న్నది. అధికారుల నివాస సముదాయాలను నిర్మిస్తున్నది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు సైతం క్యాంపు ఆఫీసులను నెలకొల్పింది. ఇక రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాల యాన్ని ఆధునిక హంగులతో నిర్మించింది. అన్ని మంత్రిత్వ శాఖల కార్యాలయాలు ఒకేచోట ఉండేలా ఈ సచివాలయాన్ని తీర్చిదిద్దింది.
పోలీసు శాఖ
ప్రజల భద్రత కోసం, నేరాలను సమూలంగా అరికట్టేందుకు ప్రభుత్వం పోలీస్ కమిషనరేట్ల సంఖ్యను పెంచింది. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేసేలా రాష్ట్రంలో ఏడు నూతన పోలీస్ కమిషనరేట్లు, 10 కొత్త పోలీస్ జిల్లాలు, 112 కొత్త పోలీస్స్టేషన్లు, 31 సర్కిల్ కార్యాలయాలు, 25 సబ్ డివిజన్ ఆఫీసులు ఏర్పాటు చేసింది. యూనిఫాం సర్వీస్ డెలివరీ కోసం దేశంలోనే తొలిసారిగా పోలీస్ శాఖలో పని విభజనతో 16 వర్టికల్స్గా పని విధానాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఠాణాల్లో రిసెప్షన్ వ్యవస్థ ఏర్పాటు చేసింది. 56 రకాల సర్వీసుల కోసం రాష్ట్రస్థాయిలో టీఎస్ కాప్ యాప్ను తెచ్చింది.
రవాణా
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు సంబంధించి టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో ఏపీలో 1,61,258 కిలోమీటర్ల పరిధిలో 826 బస్సులను టీఎస్ ఆర్టీసీ తిప్పే అవకాశం లభించింది. ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి బయటపడ వేసేందుకు కార్గో సేవలను ప్రారంభించారు. ఫలితంగా ఆర్టీసీకి రోజుకు రూ.20 లక్షలకుపైగా అదనపు ఆదాయం సమకూరుతున్నది. ఆర్టీసీ ఉద్యోగుల సంరక్షణకు డిపోల వారీగా సంక్షేమ కమిటీలను నియమించారు. ఇటీవలనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ తదితర రాయితీలను కల్పిస్తూ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ట్రాక్టర్, ట్రాలీలకు రోడ్ ట్యాక్స్ను రద్దు చేసింది.
రెవెన్యూ
భూముల రిజిస్ట్రేషన్ కోసం ధరణి పోర్టల్ను అందుబాటులోకి తీసుకురావడంతో ఇష్టా రాజ్యంగా రికార్డులు మార్చే సంస్కృతికి చెక్ పడింది. ఒకప్పుడు భూమి రిజిస్ట్రేషన్ జరగాలన్నా, హక్కుల మార్పిడి జరగాలన్నా రోజుల సమయం పట్టేది. పైరవీలు, అవినీతికి తావుండేది. కానీ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత అరగంటలోనే రిజిస్ట్రేషన్, నిమిషాల వ్యవధిలోనే మ్యుటేషన్లు పూర్తవుతున్నాయి. అవినీతికి తెర పడింది.
పట్టణ, పురపాలక శాఖ
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 52 మున్సిపాలిటీలు ఉండగా, కొత్తగా మరో 76 పురపాలక సంఘాలను ఏర్పాటు చేసింది. కార్పొరేషన్లు 6 మాత్రమే ఉండగా, ప్రభుత్వం మరో 7 మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో మున్సిపాలిటీల సంఖ్య 128కి, కార్పొరేషన్ల సంఖ్య 13కు పెరిగింది. మొత్తం పట్టణ స్థానిక సంస్థల సంఖ్య 141కు చేరింది. జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 50 శాతం ఆస్తిపన్ను రాయితీ ఇచ్చింది. వాటర్ బోర్డులో కూడా నీటిపై పన్నును, వడ్డీని మాఫీ చేస్తూ వన్టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) పేరుతో ప్రత్యేక బ్యాంకును ఏర్పాటు చేసింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ను రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పింది. వీధి వ్యాపారుల కోసం రాష్ట్రవ్యాప్తంగా స్ట్రీట్ వెండింగ్ జోన్లను ఏర్పాటు చేస్తున్నది. పట్టణాలు, నగరాల్లో ఇండ్ల నిర్మాణ అనుమతులకు టీఎస్బీపాస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. 75 గజాల్లో ఏడు మీటర్ల ఎత్తు వరకు నిర్మించే ఇండ్లకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు. 600 గజాల వరకు ఇన్స్టంట్ విధానంలో అనుమతులను మంజూరు చేస్తున్నది. నీటి కాలుష్య నివారణ కోసం జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్ఎస్టీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రతి వెయ్యి మందికి ఒక ప్రజా మరుగుదొడ్డి ఉండాలనే లక్ష్యంతో కొత్తగా 4,087 ప్రజా మరుగుదొడ్లను నిర్మిస్తున్నది.
పంచాయతీరాజ్
నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని 2018 సంవత్సరంలో తీసుకొచ్చారు. గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహించేవారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ చట్టాన్ని రూపొందిం చారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలను పెంచారు. ప్రతి గ్రామా నికి ఒక ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ను అందజే శారు. ప్రతి గ్రామానికీ పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం ఏర్పాటయ్యింది. మొక్కల పెంపకా నికి పంచాయతీరాజ్ చట్టంలో 10 శాతం నిధులను గ్రీన్ బడ్జెట్ కోసం కేటాయించారు.
పారిశ్రామిక రంగం
రాష్ట్రంలో టీఎస్ఐపాస్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు వేలాది పరిశ్ర మలు రాగా, రాష్ర్టానికి వాటి ద్వారా రూ. 3.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. వీటితో 22.5 లక్షల మంది ఉద్యో గ, ఉపాధి అవకాశాలను పొందారు. ఇం డస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ద్వారా ఇప్పటి వరకు 334 చిన్న పరిశ్రమలను పునరుద్ధ రించారు. ముచ్చర్లలో 10,400 ఎకరా ల్లో అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. డ్రోన్ పాలసీని ప్రారం భించిన మొదటి రాష్ట్రం తెలంగాణనే. వికారాబా ద్లో మెడిసిన్ ఫ్రమ్ స్కై ప్రారంభించారు. గుండె రవాణా కోసం గ్రీన్ కారిడార్ను ఏర్పాటు చేస్తున్నారు. 9 ఉమ్మడి జిల్లాల్లో టీఎస్ఎఫ్పీ జోన్లు ఏర్పా టు చేస్తున్నది. గత ఏడాది ‘తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికిల్, ఎనర్జీ స్టోరేజ్ పాలసీ’ని ప్రవేశపెట్టింది.
వైద్యం
వైద్యరంగాన్ని ఉమ్మడి పాలకులు అసలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారు. దీంతో చిన్న జ్వరాలకే ప్రజలు ప్రాణాలు కోల్పోవా ల్సిన దుస్థితి ఉండగా, సీఎం కేసీఆర్ నేతృ త్వంలో రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైద్యరంగం అనూహ్యంగా మెరుగుపడింది. నిరుపేదలకు ఉచితంగా 58 రకాల పరీక్షలు నిర్వహించేందుకు ప్రతి జిల్లా దవాఖానలో డయాగ్నొస్టిక్ హబ్లను నెలకొ ల్పారు. తెలంగాణ వచ్చేనాటికి 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా, రాష్ట్రం ఏర్పాట యిన వెంటనే 4 మెడికల్ కాలేజీలను ఏర్పా టు చేసింది. మారుమూల ప్రజలకు సైతం సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ చేసేందుకు జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నది. దీంతో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పెరిగి, స్థానిక కోటాలో తెలంగాణ విద్యార్థులకే లబ్ధి చేకూరుతున్నది. ఏఎన్ఎంల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా వారి డిజిగ్నేషన్ను ఆఫీసర్లుగా మార్చారు. సాయం త్రం 6 తర్వాత కూడా పోస్ట్మార్టం చేసేలా నిబంధనలను సవరించారు.
సాగునీరు
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టుల నిర్వహణ కు ప్రత్యేకమైన సాఫ్ట్వేర్, మొబైల్ యాప్ లను వస్సార్ ల్యాబ్స్ ఇప్పటికే రూపొందిం చింది. ప్రతి వర్షపు బొట్టును ఒడిసి పట్టడం, ప్రాజెక్టుల్లోకి పూడిక చేరకుండా నిరోధించా లనే సంకల్పంతో రాష్ట్రంలోని అన్ని వాగు లపై సుమారు 1,200 చెక్డ్యాంలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 625 చెక్డ్యాంల పనులు తుది దశకు చేరుకున్నాయి. మేజర్, మీడియం, సూక్ష్మస్థాయి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చారు. టెర్రిటో రియల్ కేంద్రంగా ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. ఫలితంగా ఒక భారీ ప్రాజెక్టుకు ఇద్దరు లేదం టే ముగ్గురు చీఫ్ ఇంజినీర్లు అందుబాటు లోకి వచ్చారు. ప్రాజెక్టులు, పంపులు, కాల్వలు, తూముల నిర్వహణ బాధ్యతల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక ఇంజినీర్ ఇన్ చీఫ్ను ఏర్పాటు చేశారు. చిన్నచిన్న మర మ్మతులు, అత్యవసర పనులకు ఈఎన్సీల అనుమతి లేకుండానే ఈఈ, డీఈల స్థాయి లోనే పనుల నిర్వహణకు మొత్తంగా అందరూ ఇంజినీర్లకు కలిపి ఏటా రూ.280 కోట్లకు పైగా కేటాయిస్తున్నారు.
సంక్షేమం
గురుకులాల్లో అనాథలకు 2 శాతం, ఎంబీసీలకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నది. పథకాలకు సంబంధించిన ఆదాయ పరిమితిని పెంచింది. రజక, నాయీబ్రాహ్మణు లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నది. రజకులకు అధునాతన దోభీఘాట్లు, సెలూన్లకు నిధులను కేటాయిం చింది. ప్రభుత్వ సంస్థల్లో బట్టలు ఉతికే పనిని రజక సొసైటీలకే అప్పగించింది. 1098 బాలరక్షక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎస్సీల అభివృద్ధి కోసం దళితబంధు పథకం కింద షరతులు లేకుండా రూ.10 లక్షలు అందిస్తున్నది. వైన్షాపుల్లో ఎస్సీలు, గౌడ కులస్తులకు రిజర్వేషన్లను కల్పించింది. ఏ ఇతర రాష్ట్రంలో లేనివిధంగా గౌడ కులస్తులే నీరా తీయడం, విక్రయాలు చేయాలని పేర్కొంటూ నీరా పాలసీని రూపొందించింది. హైదరాబాద్ ట్యాంక్బండ్ పీవీ మార్గ్లో రూ.20 లక్షలతో నీరా కేఫ్ ఏర్పాటుచేసింది. కోకాపేటలో రూ.300 కోట్ల విలువైన స్థలం గౌడ భవన్కు కేటాయించి, భవన నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేసింది.
– మ్యాకం రవికుమార్