ములుగు రూరల్, జూన్ 24: ములుగు జడ్పీ చైర్మన్ దివంగత కుసుమ జగదీశ్వర్ కుటుంబానికి ఎమ్మెల్యే పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అండగా నిలిచారు. ఇటీవల జగదీశ్వర్ గుండెపోటుతో మరణించగా ఆయన కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పోచంపల్లి రూ.పది లక్షల చెక్కును సమకూర్చారు.
శనివారం ఆ చెక్కును రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి ములుగు మండలం మల్లంపల్లికి వెళ్లి జగదీశ్వర్ భార్య రమాదేవికి అందజేశారు. 14 ఏండ్లపాటు తెలంగాణ సాధనలో విశేష కృషిచేసిన జగదీశ్వర్ మృతిచెందడం పార్టీకి, కార్యకర్తలకు తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.