నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జలాశయానికి భారీగా వరద వస్తుండటంతో అధికారులు 10 గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 1,56,516 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 1.22 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం 589.60 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ 312 టీఎంసీలకుగాను 310.85 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.