హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): గల్వాన్ లోయలో వీరమరణం పొందిన మహావీరచక్ర అవార్డు గ్రహీత కర్నల్ సంతోష్బాబు సతీమణి సంతోషికి రూ.1.25 కోట్ల నగదు అందజేయడానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. కేంద్రం పరమవీర చక్ర అవార్డు కింద రూ.1.25 కోట్ల నగదును సంతోష్బాబు భార్య సంతోషికి అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.