ఎయిర్పోర్టులో సూడాన్ దేశస్థురాలి నుంచి స్వాధీనం
శంషాబాద్, అక్టోబర్ 5; శంషాబాద్ ఎయిర్పోర్టులో మంగళవారం సూడాన్ దేశస్థురాలి నుంచి 1.2 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ మహిళ సూడాన్ నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్ వచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగిన అనంతరం కస్టమ్స్ సిబ్బంది జరిపిన తనిఖీలో ఆమె లోదుస్తుల్లో, చేతిబ్యాగ్లో బంగారం బయటపడింది. స్వాధీనం చేసుకున్న 1209 గ్రాముల బంగారం విలువ రూ.58.16 లక్షలు ఉంటుంది. మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.