హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కేంద్రం గా భౌగోళిక అంశాలపై అధ్యయనం చేసే ఎన్జీఆర్ఐ మరో కీలక అంశంపై పరిశోధనలు చేస్తున్నది. ఎన్నో జీవనదులకు కేంద్రమైన హిమా లయ పర్వతాల అడుగున ఉన్న భూకంప కేంద్రాలు, ఖనిజాల అధ్యయనం, వేడి నీటి సరస్సుల మిస్టరీని తేల్చనున్నది. లేహ్లడక్ లాంటి పర్వత ప్రాంతాల్లో సర్వే చేయడానికి అత్యాధునిక డ్రోన్లను వినియోగించింది. బెంగళూరులోని నేషనల్ ఏరోస్పే స్ ల్యాబోరేటరీ సహకారంతో సర్వే చేశారు.
గడ్డ కట్టే మంచు ప్రాంతంలో వేడి నీటి సరస్సులకు హిమాలయాలు కేంద్రంగా ఉన్నా యి. అంతుచిక్కని ఈ సరస్సులను పరిశీలించేందుకు మ్యాగ్నటిక్ సర్వే సాయపడుతుందని చెప్తున్నారు. లేహ్ ప్రాంతంలో చుమతాం గ్, పనామిక్, పుగా వంటి సరస్సుల్లో ఓవైపు మంచు కురుస్తున్న వేడి నీరు ప్రవహిస్తున్నదని పరిశోధకులు వివరించారు. మిస్టరీని గుర్తిస్తే మరింత లోతుగా భూభౌగోళిక అంశాల పరిశీలనకు అవకాశం ఉంటుందంటున్నారు.