హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): సివిల్స్-2021లో విజేతలుగా నిలిచిన పలువురు అభ్యర్థులు బుధవారం కోకాపేటలోని నివాసంలో రాష్ట్ర ఆర్థిక , ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావును ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా సివిల్స్ ర్యాంకర్లు జీ సుధీర్రెడ్డి (69), స్నేహ (136), చైతన్యరెడ్డి (161), రంజిత్ కుమార్ (574), స్మరణ రాజ్ (676) సహా సివిల్స్ సబ్జెక్ నిపుణురాలు, మెంటార్ బాలలతను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
వారికి శాలువా కప్పి సత్కరించారు. తెలంగాణ గర్వించేలా, దేశం మెచ్చేలా ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. అనంతరం వారితో కలిసి మంత్రి అల్పాహారాన్ని స్వీకరించారు. సివిల్స్ విజేతల కుటుంబ నేపథ్యం, ప్రిపరేషన్లో ఎదురొన్న సవాళ్లు, ఇంటర్వ్యూ జరిగిన తీరు గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకొన్నారు. బాలలత లాంటి మెంటార్ల సలహాలు, సూచనలతో విజయావకాశాలు మరింత చేరువవుతాయన్నారు.
సివిల్స్లో విజయం సాధించిన పేదింటి బిడ్డ, ఎస్సీ గురుకులాల పూర్వ విద్యార్థి ఆకునూరి నరేశ్ను మంత్రి కొప్పుల ఈశ్వర్ అభినందించారు. 6 నుంచి 10 తరగతి వరకు నర్సంపేటలో, ఇంటర్మీడియట్ను రంగారెడ్డి జిల్లా చిలుకూరు గురుకుల పాఠశాలలో చదివి సివిల్స్లో 117వ ర్యాంకు సాధించిన నరేశ్ ఎస్సీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్ రాస్తో కలిసి బుధవారం ఉదయం మంత్రి కొప్పులను మర్యాదపూర్వకంగా కలిశారు.