వికారాబాద్, (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లా 4వ కలెక్టర్గా కే. నిఖిల బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జనగామ కలెక్టర్గా పనిచేస్తున్న ఆమెను సోమవారం రాత్రి జరిగిన బదిలీల్లో వికారాబాద్ జిల్లా కలెక్టర్గా నియమితులయ్యారు. ఇక్కడ ఆగస్టు 30వ తేదీ వరకు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించిన పౌసుమి బసు బదిలీ అయ్యారు. ఆమె నుంచి నిఖిల బాధ్యతలు స్వీకరించారు. ఇక కొత్త కలెక్టర్ నిఖిలకు జిల్లాతో పరిచయం ఉంది. 2015 బ్యాచ్కు చెందిన ఆమె ట్రైనీ కలెక్టర్గా ఫీల్డ్ విజిట్లో భాగంగా వికారాబాద్ జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిఖిల జిల్లా అధికారులతో పరిచయ అనంతరం మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు ధరణి సిబ్బంది ఉదయం 9.30 గంటలకు పనులు ప్రారంభించేందుకు లాగిన్ అవ్వాలని సూచించారు.
15రోజుల్లో అన్ని పెండింగ్ పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా కృషి చేస్తానన్నారు. అధికారులు అందరు కష్టపడి సమర్థవంతంగా పనిచేయాలని, పనిలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. బాధ్యతలు స్వీకరించే ముందు ఆమె మంత్రి సబితారెడ్డిని నగరంలోని మంత్రి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నూతన కలెక్టర్కు మంత్రి అభినందనలు తెలిపారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్కుమార్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
పలువురి శుభాకాంక్షలు
వికారాబాద్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కే. నిఖిలను అధికారులు, అనధికారులు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్లు మోతీలాల్, చంద్రయ్య, జడ్పీ సీఈవో జానకీరెడ్డి, కలెక్టరేట్ ఏవో హరిత, డీఆర్డీవో పిడీ కృష్ణన్, సీపీవో మోహన్రెడ్డి, అటవీ శాఖ అధికారి వేణుమాధవ్, ఆర్అండ్బీ ఈఈ లాల్సింగ్, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి రాజేశ్వర్, డీఎం విమల, ఆర్డీవోలు అశోక్, ఉపేందర్, జిల్లా ఎంపీడీవోలు, ఎంపీవోలు శుబాకాంక్షలు తెలిపారు.
కలెక్టర్ను కలిసిన జడ్పీసీఈవో
వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలను స్వీకరించిన సం దర్భంగా కలెక్టర్ నిఖిలకు వికారాబాద్ జిల్లా పరి షత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి జానకీరెడ్డి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వికారాబాద్ ఎంపీడీవో సుభాషిణి, పూడూరు ఎంపీడీవో ఉషలు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అదనపు ముఖ్య కార్యనిర్వాహణ అధికారులుగా పదోన్నతులు పొందిన వికారాబాద్ ఎంపీడీవో సుభాషిణి, పూడూరు ఎంపీడీవో ఉషలు బుధవారం వికారాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీసీఈవో జానకీరెడ్డికి రిపోర్టు చేశారు.