హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): రైమ్ ఆర్గానిక్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ప్రొపికొనజోల్, డైఫెనోకొనజోల్ కలిసిన పురుగుమందుపై వ్యవసాయ శాఖ నిషేధం విధించింది.
నాణ్యత పరీక్షలో ఇది నాసిరకంగా తేలినట్టు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో దీనిని దుకాణదారులకు విక్రయించొద్దని, పంటలకు పిచికారీ చేయొద్దని రైతులకు సూచించారు.