మోర్తాడ్, మే 7: ‘అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ముందుకు వచ్చి ఎకరానికి రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. అదే విధంగా కేంద్రం ద్వారా మరో రూ.10 వేలు ఇప్పించాలి’ అని బీజేపీ నాయకులకు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సవా ల్ చేశారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం దొన్కల్, ధర్మో రా, శెట్పల్లి, ముప్కాల్ మండలం రెం జర్ల గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
దొన్కల్ శివారులో నష్టపోయిన నువ్వుల పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో మీకు ఓట్లు వేయలేదా? మరి ఇక్కడి రైతుల కోసం మీరేం చేయరా? మీకు సిగ్గుశరం, ద మ్ముంటే ముందుగా మోదీ చేత అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు ఇచ్చేలా ప్రకటన చే యించాలి’ అని డిమాండ్ చేశారు. కేం ద్రం నుంచి రైతుల కోసం రూపాయి తీసుకురావడం చేతకాని వారు ఇక్కడ పంటల వెంట తిరుగుతూ మొసలికన్నీ రు కార్చడం, డ్రామాలు ఆడటం, రైతులను రెచ్చగొడతారా? అంటూ మండిపడ్డారు.
కేంద్రం నుంచి నష్టపోయిన రైతులకు డబ్బులు ఇప్పించే వరకు పంటల పరిశీలనకు రావొద్దని మంత్రి హెచ్చరించారు. దేశంలో ఎక్కడా ఏ సీఎం కూడా ఇంత మొత్తం నష్టపరిహారం ఇవ్వలేదని, ఇది ఒక్క తెలంగాణాలోనే ఇస్తున్నట్టు చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు తడిసి న ధాన్యాన్ని సైతం కొంటామని రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు.