కొత్తపల్లి, సెప్టెంబర్ 16: హిమాచల్ప్రదేశ్లోని మనాలీలో ఉన్న 5,289 మీటర్ల ఎత్తయిన మౌంట్ ఫ్రెండ్షిప్ పర్వతాన్ని పర్వతారోహకుడు, కరీంనగర్ ఎక్సైజ్ కానిస్టేబుల్ లెంకల మహిపాల్రెడ్డి అధిరోహించారు. ఈ నెల 13వ తేదీ రాత్రి 22 మందితో కలిసి మహిపాల్రెడ్డి పర్వతారోహణ ప్రారంభించారు. మహిపాల్రెడ్డితో పాటు హర్యానాకు చెందిన మరో ముగ్గురు మాత్రమే పర్వతాన్ని అధిరోహించగలిగారు. పర్వతం అంచున జాతీయ పతాకం, తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ బ్యానర్ను ఆవిష్కరించారు.
మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు పర్వతంపై ‘మాదక ద్రవ్యాలు వద్దు- జీవితం ముద్దు’ నినాదంతో కూడిన బ్యానర్ ప్రదర్శించారు. మౌంట్ ఫ్రెండ్షిప్ పర్వతాన్ని పూర్తిగా అధిరోహించడం చాలా కఠినమైనదని, అందుకే నలుగురు మాత్రమే పర్వతాన్ని అధిరోహించినట్లు మహిపాల్రెడ్డి చెప్పారు. పర్వాతరోహణకు సహకరించిన కరీంనగర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.