హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా ఉన్మాదంతో కూడిన బీజేపీ ఫాసిస్టు విధానాలను ఎదుర్కోవడానికి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను ఏర్పాటుచేయటం జాతీ య రాజకీయాల్లో కీలక మలుపు అని ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరిణామాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఆదానీ, అంబానీలకు గులాంగిరి చేస్తూ దేశాన్ని, జాతీయ సంపదను కార్పోరేట్లకు దోచిపెడుతున్న మోదీ ప్రభుత్వాన్ని ఎండగట్టి బలమైన ప్రతిపక్షం ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ముందుకు రావడంపై హర్షం వ్యక్తంచేశారు. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ సమర్థ పాత్ర పోషించగలదని భావిస్తున్నదని చెప్పారు. మోదీ, అమిత్షా కుటిల రాజనీతికి వెరవకుండా, ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొవడానికి సిద్ధపడి కేసీఆర్ జాతీ య రాజకీయాల్లోకి ప్రవేశించడం సాహసోపేతమైన నిర్ణయంగా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కమిటీ భావిస్తున్నదని వెల్లడించారు. 15, 16 తేదీల్లో కేంద్ర కార్యదర్శి వర్గ సమావేశాలు హైదరాబాద్లో నిర్వహిస్తున్నామని, బీఆర్ఎస్పై చర్చిం చి కేసీఆర్ని కలుస్తామని చెప్పారు.