హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): హజ్ యాత్రికుల కోసం విమానయాన షెడ్యూల్ను ఆదివారం ప్రకటించా రు. నేటి నుంచి ఆగస్టు 2 వరకు యాత్ర విమానాలు రాకపోకలు సాగించనున్నా యి. ఇందుకు 16 ఎంబార్కింగ్ పాయింట్లను నిర్దేశించారు. ప్రయాణికులు సకాలంలో ఎంబార్కింగ్ పాయింట్లకు చేరుకొని తమ పత్రాలు పరిశీలన త్వరగా పూర్తి చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.
హైదరాబాద్ హజ్ యాత్రకు సంబంధించిన విమానం వచ్చే నెల 7వ తేదీన బయలుదేరనున్నది. హజ్ యాత్రికులకు ఆదివారం నాంపల్లిలోని మస్జిద్-ఏ-బగ్దాదిలో 9వ శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హజ్ కమిటీ చైర్మన్ సలీమ్ హాజరై, అవగాహన కల్పించారు. హజ్ యాత్రికులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు.